మాచర్లలో జూలకంటి బ్రహ్మారెడ్డి భారీ విజయం

పల్నాడు జిల్లాలోని మాచర్ల నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ ప్ర‌స్తుతం ఎమ్మెల్యే పినెల్లి రామ‌కృష్ణారెడ్డి గెలుపు పర్వం ముగిసింది. ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. మాచర్ల నియోజకవర్గంలో వరుసగా 20 ఏళ్లుగా పినెల్లి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి  పినెల్లిపై విజయం సాధించారు.మాచర్ల అసెంబ్లీ స్థానంలో 21 రౌండ్ల కౌంటింగ్ పూర్తికాగా జూలకంటి31,761 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. 21 రౌండ్ల తర్వాత జూలకంటికి 1,18,290 ఓట్లు రాగా, పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి 86,529 ఓట్లు వచ్చాయి. ఒక రౌండ్ కౌంటింగ్ మాత్రమే మిగిలి ఉండగా జూలకంటి గెలుపు ఖరారైంది.

About The Author: న్యూస్ డెస్క్