ఓటు వేసేందుకు సొంతూరుకు వచ్చి బస్సులో హైదరాబాద్ కు తిరిగి వచ్చిన ఈ ఐదుగురి జీవితాలు తెల్లవారుజామున తెల్లబోయాయి. టిప్పర్ ట్రక్కు రూపంలో మృత్యువు వారిని అనంత లోకాలకు చేర్చింది. టూరిస్ట్ బస్సును టిప్పర్ట్రక్కు ఢీకొనడంతో బస్సు డ్రైవర్ సహా ఐదుగురు సజీవదహనమయ్యారు. ఈ ఘటనలో మరో 20 మంది గాయపడ్డారు. పల్నాడు జిల్లా చిలుకలూరిపేట మండలంలో ప్రమాదం జరిగింది.