కడపలో వేడెక్కిన రాజకీయాలు..

వైసీపీని కాదని షర్మిలకు ( కాంగ్రెస్ ) మద్దతిచ్చిన విజయమ్మ...

గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఆదరించినట్లే, ఇప్పుడు షర్మిలను ఆదరించాలని కడప ప్రజలకు విన్నపం చేశారు. 

YSR బిడ్డ షర్మిలమ్మ ఎంపీ గా పోటీ చేస్తుంది, షర్మిలను కడప ఎంపీగా గెలిపించి పార్లమెంట్ కి పంపాలని వీడియో సందేశం ద్వారా ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

 మరోవైపు సీఎం జగన్ సిట్టింగ్ ఎంపీ అవినాష్ రెడ్డిని మరోసారి కడప ఎంపీ బరిలో నిలిపారు.

 అవినాష్ రెడ్డితో తలపడుతున్న తన కూతురు షర్మిలకు ఓట్లు వేసి గెలిపించాలని కడప ఓటర్లను విజయమ్మ కోరడంతో ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కాయి.

About The Author: న్యూస్ డెస్క్