సముద్ర స్నానాలకు వెళ్లి మంగళగిరి యువకులు మృతి!

మంగళగిరికి చెందిన 12 మంది యువకులు స్నానాల కోసం ఈరోజు బాపట్ల జిల్లా రామాపురం బీచ్‌కు వచ్చారు. అయితే సముద్రంలో దిగిన వారిలో నలుగురు గల్లంతయ్యి ఇద్దరు చనిపోయారు. మృతులు బాలసాయి, బాలనాక్షేశ్వరరావు (బాలు)గా గుర్తించారు. మరో ఇద్దరిని స్నేహితులు రక్షించారు. 

ఈ ఘటనపై మంగళగిరి, ఏపీ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ విచారం వ్యక్తం చేశారు. మంగళగిరి నియోజకవర్గ కేంద్రంలోని కుపారపులో నివాసముంటున్న పడవల బాలసాయి, కూసనం బాలు అనే యువకులు మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతిని మిగిల్చిందన్నారు. 

బంగారు భవిష్యత్తు ఉన్న ఇద్దరు యువకులు విహారయాత్రకు బెట్టపాలెం మండలంలోని బీచ్‌కు వెళ్లగా అక్కడ విషాదం నెలకొంది. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు లోకేష్ ట్వీట్ చేశారు.

About The Author: న్యూస్ డెస్క్