అనంతపురం మాజీ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డిపై సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేసిన రిటైర్డ్ ఎస్పీ

అనంతపురం అర్బన్‌ మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డిపై రిటైర్డ్‌ ఎస్పీ వరనరసింహారెడ్డి సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. అనంత వెంకట్రామి రెడ్డి అక్రమాలపై విచారణ జరిపించాలని సీఎంను కోరారు. వెంకట్రామిరెడ్డి కేంద్రం వనరులను దుర్వినియోగం చేశారని, తన సోదరుడితో కలిసి వెంకట్రామిరెడ్డి అవినీతికి పాల్పడ్డారని వరణరసింహారెడ్డి ఆరోపించారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై తగిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబును కోరారు. 

ఇదిలా ఉంటే ఇటీవలి ఎన్నికల్లో అనంత వెంకటరామి రెడ్డి ఓడిపోయారు. ఆయన 23,023 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి దగపతి ప్రసాద్ చేతిలో ఓడిపోయారు.

About The Author: న్యూస్ డెస్క్