రతన్ టాటా మృతికి సంతాపం తెలిపిన ఏపీ కేబినెట్

ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం . 
 సంతాపం ప్రకటించింది ముఖ్యమంత్రి  నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. సమావేశానికి ముందు  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన మంత్రివర్గ సభ్యులు రతన్ టాటాకు సంతాపం తెలిపారు. ఈ అంశంపై ఎలాంటి చర్చ జరగకుండానే మంత్రి మండలి సమావేశాన్ని వాయిదా వేసింది. దీంతో నేటి సమావేశం ముగిసింది.  వరద ప్రభావిత ప్రాంతాల్లో రుణాల రీ షెడ్యూల్‌కు సంబంధించి స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపు ప్రతిపాదనపై.. చెత్త పన్ను రద్దు ప్రతిపాదనపై.. 13 కొత్త మున్సిపాలిటీల్లో 190 కొత్త పోస్టుల భర్తీ ప్రతిపాదనపై కేబినెట్ సమావేశం చర్చించాల్సి ఉంది.

About The Author: న్యూస్ డెస్క్