ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం త్వరలో ప్రారంభిస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు

ఏపీలో టీడీపీ కూటమి ఎన్నికల హామీల్లో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడం ఒకటి. దీనిపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పందించారు. 

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అతి త్వరలో ప్రారంభిస్తామని, దీనికి సంబంధించి ప్రకటన వెలువడుతుందని తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణ కార్యక్రమం ఎవరికీ ఇబ్బంది లేకుండా పారదర్శకంగా అమలు చేస్తామన్నారు. 

ఉచిత బస్సు ప్రయాణ కార్యక్రమాన్ని కర్ణాటక, తెలంగాణల్లో కూడా అమలు చేస్తామని, అయితే అక్కడ తలెత్తే లోపాలు ఏపీలో తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, రవాణా శాఖ, ఏపీఎస్‌ఆర్టీసీ ద్వారా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. 

తనకు మంత్రిగా అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబు బాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. తాను తలపెట్టిన శాఖలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా అన్ని విధాలా కృషి చేస్తానన్నారు. మంత్రిగా మందపల్లి రాంప్రసాద్ రెడ్డి ఇవాళ బాధ్యతలు స్వీకరించారు.

About The Author: న్యూస్ డెస్క్