జగన్‌తో రాజ్యసభ సభ్యుడు పరిమళ్ నత్వానీ భేటీ!

రిలయన్స్ వ్యాపార సామ్రాజ్యంలో కీలకంగా వ్యవహరిస్తున్న పరిమళ్ నత్వానీ ఏపీ కోటాలో రాజ్యసభ సీటును దక్కించుకున్న సంగతి తెలిసిందే. 2020లో వైసీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన నలుగురిలో పరిమళ్ నత్వానీ ఒకరు. నత్వానీకి వైసీపీతో ఎలాంటి సంబంధం లేకపోయినా, ముఖేష్ అంబానీ కారణంగానే అప్పటి ప్రధాని జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. 

ఇక ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం చవిచూసింది. లోక్‌సభ ఎన్నికల్లోనూ ఆ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ నేపథ్యంలో నేడు వైసీపీ అధినేత జగన్‌తో పరిమళ నత్వానీ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈరోజు వైసీపీ ఎంపీలతో జగన్ భేటీ అయ్యారు. ఈ సమావేశానికి వైసీపీ లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు హాజరయ్యారు. 

ఈ సమావేశంలో విజయసాయిరెడ్డి, వై.వి. సుబ్బారెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి, గురుమూర్తి, పరిమళ్ నత్వాని తదితరులున్నారు. భవిష్యత్ కార్యాచరణపై జగన్ తన పార్టీ ఎంపీలతో చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా హాజరయ్యారు.

About The Author: న్యూస్ డెస్క్