ఏపీఎస్ఆర్టీసీ ఎండీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ
ఏపీలో ఎల్లుండి మే 13న సార్వత్రిక ఎన్నికల పోలింగ్
హైదరాబాద్ నుంచి ఏపీకి భారీగా తరలి వస్తున్న ఓటర్లు
వారి కోసం అదనపు బస్సులు ఏర్పాటు చేయాలన్న చంద్రబాబు.
లేఖలోని అంశాలు
• మే 13వ తేదీన ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో ఉన్న ఏపీ ఓటర్లు ఓటు వేసేందుకు సొంత ప్రాంతాలకు వస్తారు.
• ఇప్పటికే హైదరాబాద్ తో పాటు ఇతర ప్రాంతాల నుండి ఓటు వేసేందుకు ఏపీలోని తమ ఊళ్లకు ప్రజలు ప్రయాణమవుతున్నారు.
• ఇలాంటి సమయంలో సొంత ప్రాంతానికి వెళ్లడానికి ఆర్టీసీ సౌకర్యం ఎంతగానో ఉపయోగపడుతుంది.
• ఇప్పటికే హైదరాబాద్, విజయవాడ బస్టాండ్ లలో ప్రయాణికుల రద్దీ కనిపిస్తోంది.
• అవసరమైనన్ని బస్సులు అందుబాటులో లేక సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులు బస్ స్టేషన్లలో నిరీక్షిస్తున్నారు.
• ఈ రెండు మూడు రోజులు అదనపు బస్సులు ఏర్పాటు చేసి ప్రయాణ సౌకర్యానికి ఇబ్బంది లేకుండా చేయాలి.
• రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచడం వల్ల ఓటింగ్ శాతం పెరగడానికి అవకాశం ఉంటుంది... అని చంద్రబాబు తన లేఖలో వివరించారు.