ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో టాలీవుడ్ నిర్మాతలు భేటీ !

ఈరోజు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో టాలీవుడ్ సినీ నిర్మాతలు భేటీ కానున్నారు. సోమవారం మధ్యాహ్నం విజయవాడలో ఈ సమావేశం జరగనుంది. 

నిర్మాతలు అశ్వనీదత్, ఎస్. రాధాకృష్ణ (చినబాబు), యెర్నేని నవీన్, రవిశంకర్, డీవీవీ దానయ్య, భోగవల్లి ప్రసాద్, విశ్వప్రసాద్, నాగవంశీలతో పాటు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు, కార్యదర్శి దామోదర్ ప్రసాద్ తదితరులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను క్యాంపు కార్యాలయంలో కలవనున్నారు. విజయవాడ. 

సినీ పరిశ్రమ సమస్యలను పవన్ కళ్యాణ్ కు చెప్పనున్నారు సినీ నిర్మాతలు. సినిమా టిక్కెట్ల ధరలను పెంచే అవకాశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. థియేటర్ల సమస్యలపై కూడా నిర్మాతలు పవన్‌తో మాట్లాడనున్నారు.

About The Author: న్యూస్ డెస్క్