![వైసీపీ హయాంలో తాను ఎదుర్కొన్న దారుణాలను వెల్లడించిన ఉద్యోగ సంఘం నేత సూర్యనారాయణ](https://www.netipourusham.com/media-webp/c200x160/2024-06/123131456_25surya1a.jpg)
వాతావరణ శాఖ చల్లని కబురు
ఈ వేసవిలో దేశమంతా ఎండలు మండిపోతున్నాయి. వడగళ్ల వాన, వరదలతో ప్రజలు వణికిపోతున్నారు. ఈ సమయంలో వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు కాస్త ముందుగా దేశంలోకి రానున్నాయని ప్రకటించారు. వచ్చే 5 రోజుల్లో... రుతుపవనాలు ఈ నెల 19 నాటికి దక్షిణ అండమాన్, నికోబార్ దీవులు, ఆగ్నేయ బెంగాల్కు చేరుకుంటాయి.
అల్పపీడనం ఇప్పుడు దక్షిణ కర్ణాటక నుంచి వాయువ్య మధ్యప్రదేశ్ వరకు విస్తరించి ఉంది. ఏపీలోని పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈరోజు వడగాలుల ప్రభావం ఉండదని వెల్లడించింది. కోనసీమ, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విశాఖ, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. నిన్న పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ప్రకాశం జిల్లా బల్లిపల్లిలో అత్యధికంగా 79 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఏలూరు జిల్లా జీలుగుమిల్లిలో గరిష్ట ఉష్ణోగ్రత 41.2 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది.