ప్రకాశం జిల్లా కనిగిరి మండల పరిధిలోని పొనుగోడు గ్రామం ఎస్టీ కాలనీ సమీపంలో మంగళవారం సాయంత్రం బైక్పై విద్యుత్ వైరు తగిలి ముగ్గురు యువకులు విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో బైక్ దగ్ధమైంది.
కనిగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్(సీఐ) వెంకటేశ్వరరావు, ఎస్ఐ రాజేష్ తెలిపిన వివరాల ప్రకారం.. మృతులు కనిగిరి పట్టణానికి చెందిన గౌతమ్కుమార్(16), నజీర్(16), బాలాజీ(17)లు ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నారు. ముగ్గురు వ్యక్తులు కనిగిరి నుంచి పొనుగోడుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఈ దుర్ఘటనపై విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ విచారణకు ఆదేశించారు.
కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ఎం ఉగ్ర నరసింహారెడ్డిని సంప్రదించి ప్రమాదంపై ఆరా తీశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. రాష్ట్రంలో జరుగుతున్న విద్యుత్ ప్రమాదాలను ఆయన తీవ్రంగా ఖండించారు. “బాధితులకు ఎక్స్గ్రేషియా మంజూరు చేయడం ద్వారా ఆర్థిక సహాయం చేయడం విషయం కాదు, అయితే ఈ విషాద సంఘటనలను మనం ఆపాలి” అని ఆయన అన్నారు.