కువైట్‌లో బుధవారం భారీ అగ్నిప్రమాదం మృతుల్లో ఎక్కువ మంది భారతీయులు

కువైట్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో మరణించిన 49 మందిలో ముగ్గురు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారని ఇటీవల వెల్లడైంది. మరణించిన 49 మందిలో 45 మంది భారతీయులు కాగా అత్యధికంగా 24 మంది కేరళకు చెందినవారు. ఏడుగురు తమిళనాడుకు చెందిన కూలీలు.కువైట్‌లో అగ్నిప్రమాదానికి గురైన వారిలో ముగ్గురు తెలుగు  ఉన్నారని ఏపీ  తెలుగువారి సంఘం (ఏపీఎన్‌ఆర్‌టీ) వెల్లడించింది. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం జింకిభద్రకు చెందిన తామాడ లోకనాథం(31), తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం కందవల్లికి చెందిన సత్యనారాయణ.అన్నవరప్పాడు  చెందిన మీసాల ఈశ్వరుడు ఉన్నట్టు తెలిపింది.ఈ మధ్యాహ్నం వారి మృతదేహాలు ఢిల్లీకి వస్తాయని ప్రకటించి స్వస్థలాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేశారు.

About The Author: న్యూస్ డెస్క్