హజ్‌ యాత్రలో మరణించిన భారతీయులు సంఖ్య 68 మంది మృతి

భారత్ నుంచి వచ్చిన వారూ మృతి చెందినట్లు గుర్తించామన్న సౌదీ దౌత్యవేత్తవృద్ధాప్యం నుంచి... సహజ మరణం పొందిన వారు కూడా ఉన్నారని తేలింది.
వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల‌తో కొంత మంది చ‌నిపోయిన‌ట్లు తేలింది.

ఈ ఏడాది 68 మంది భారతీయులు సహా 600 మందికి పైగా యాత్రికులు మరణించారని సౌదీ దౌత్యవేత్త బుధవారం తెలిపారు. భారత్ నుంచి వచ్చిన వారిలో 68 మంది మరణించారు. వారిలో కొందరు సహజ మరణాలు, మరికొందరు వృద్ధాప్యం కారణంగా మరణించారు. మరికొందరు వాతావరణ పరిస్థితుల వల్ల చనిపోయారని చెప్పారు.ఈ ఏడాది హజ్ యాత్రలో తీవ్ర వేడి కారణంగా 550 మందికి పైగా మరణించినట్లు అరబ్ అధికారులు మంగళవారం ప్రకటించారు. మక్కాలో 52 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మృతుల్లో ఎక్కువ మంది ఈజిప్ట్ మరియు సౌదీ అరేబియా నుండి వచ్చారు. మరో 2,000 మంది ఎండవేడిమితో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

About The Author: న్యూస్ డెస్క్