ఓటు వేసేందుకు వెళ్తున్న ఒక వ్యక్తిపై ఏనుగు దాడి..వ్యక్తి మృతి

పోలింగ్ కేంద్రాలకు వెళ్తున్న ఓ వ్యక్తిపై ఏనుగు దాడి చేసింది.  అతన్ని తొక్కి చంపేసింది. ఈ ఘటన జార్ఖండ్‌లోని తూర్పు సింగ్‌భూమ్ జిల్లాలో చోటుచేసుకుంది.

 గోబర్బాని  గ్రామానికి చెందిన ఈ 71 ఏళ్ల వ్యక్తి ఉదయం 6:30 గంటలకు ఓటు వేయడానికి తన ఇంటి నుండి బయలుదేరాడు. శనివారము రోజున. ధోలబెడ  అటవీ మార్గంలో పోలింగ్ స్టేషన్ వైపు నడుచుకుంటూ వెళ్తుండగా ఏనుగు దాడి చేసింది. వృద్ధుడిని తొక్కి  చంపింది.

ఇంతలో విషయం తెలుసుకున్న గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు మృతుడు 71 ఏళ్ల సురేంద్ర నాథ్‌గా గుర్తించారు. శవపరీక్ష అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. అంత్యక్రియలకు తక్షణ సహాయంగా, అటవీ శాఖ రూ. 25,000 విరాళంగా అందించిందని కుమారుడు తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

 

About The Author: న్యూస్ డెస్క్