భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఓటు వేశారు. తన కుమారుడు అర్జున్ టెండూల్కర్తో కలిసి ముంబైలోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల (లోక్సభ ఎన్నికలు) ఐదో దశ పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభమైంది. మరియు సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది. ఈ నేపథ్యంలో సాధారణ వ్యక్తులతో పాటు పలువురు ప్రముఖులు కూడా ఉదయం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. భారత క్రికెట్ దిగ్గజం, సచిన్ టెండూల్కర్ కూడా ఓటు వేశారు. తన కుమారుడు అర్జున్ టెండూల్కర్తో కలిసి ముంబైలోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని పిలుపునిచ్చారు.కాగా, ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేలా ఓటర్లను ప్రోత్సహించేందుకు భారత ఎన్నికల సంఘం క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ను ' నియమించినట్లు వెల్లడైంది. దీనికి సంబంధించి గతేడాది ఆగస్టులో ఒప్పందం కుదిరింది. యువ ఓటర్ల భాగస్వామ్యాన్ని పెంచేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుందని ఎన్నికల సంఘం భావిస్తోంది.