ప్రధాని మోదీకి ఓటేయవద్దని టీచర్‌ అరెస్ట్

ప్రధాని మోదీకి ఓటు వేయవద్దని పిల్లలకు సూచించిన ఓ పాఠశాల ఉపాధ్యాయుడికి ఊహించని షాక్ తగిలింది. బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో పోలీసులు పాఠశాల ఉపాధ్యాయుడిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని జిల్లా విద్యాశాఖాధికారి ఫిర్యాదు చేయడంతో ఉపాధ్యాయుడిపై కేసు నమోదైంది.

కుర్హాని బ్లాక్‌లోని అమ్రాఖి ప్రభుత్వ స్కూల్‌కు చెందిన ఉపాధ్యాయుడు హరేంద్ర రజక్‌పై విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఉపాధ్యాయుడు ప్రభుత్వ అధికారిగా రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా ఎన్నికలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారని డీఈవో తెలిపారు.అతడిపై చర్యలు చేపట్టనున్నట్టు తెలిపారు. 

.

 

 

About The Author: న్యూస్ డెస్క్