- తమిళనాడులోని తేన్ కాశి జిల్లాలో కొన్ని రోజులుగా వర్షాలు
- కళ్లెదుటే ఉద్ధృతమైన నీటి ప్రవాహం
- ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీసిన పర్యాటకులు
- వైరల్ అవుతున్న వీడియో
కుర్తాళం... తమిళనాడులోని తేన్ కాశీ జిల్లాలో పశ్చిమ కనుమలలో ఒక పుణ్యక్షేత్రం. ఇక్కడి జలపాతం పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణ. అయితే ఈ ప్రాంతంలో గత ఐదు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.
ఎప్పటిలాగే, పురాతన కుర్తాళం జలపాతాల వద్దకు పర్యాటకులు వచ్చినప్పుడు, కొన్ని సెకన్లలో ఆకస్మిక వరదలు సంభవించాయి. చూస్తుండగానే నీటి ప్రవాహం పెరిగింది. దీంతో పర్యాటకులు షాక్కు గురయ్యారు. ఒకరి చేతులు ఒకరు పట్టుకుని పరుగులు తీశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
కాగా, కుర్తాళం భయానక రూపుదాల్చిన నేపథ్యంలోఅశ్విన్ అనే 17 ఏళ్ల బాలుడు అదృశ్యమయ్యాడు. 11వ తరగతి చదువుతున్న బాలుడు పాళయంకోట్టై జిల్లాలోని ఎన్జీవో కాలనీకి చెందినవాడు.
జిల్లా కలెక్టర్ ఎస్పీ వెంటనే స్పందించి కుర్తాళం జలపాతం వద్దకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే జలపాతానికి అర కిలోమీటరు దూరంలో రాళ్ల మధ్య అశ్విన్ మృతదేహం కనిపించింది.