పత్రికా సమావేశాలపై తనపై వస్తున్న విమర్శలకు స్పందించిన మోడీ

పత్రికా సమావేశాలపై తనపై వస్తున్న విమర్శలకు స్పందించిన మోడీ

  • తానెప్పుడూ పత్రికా ఇంటర్వ్యూలను కాదనలేదన్న ప్రధాని
  • మీడియాను అనేక రకాలుగా వాడుకుంటున్నారని వ్యాఖ్య
  • తనకు ఆ మార్గంలో వెళ్లడం ఇష్టం లేదని స్పష్టీకరణ
  • ప్రస్తుతం ప్రజలతో అనుసంధానమయ్యేందుకు అనేక ప్రత్యామ్నాయాలు ఉన్నాయని వెల్లడి

విపక్షాల విమర్శలకు ప్రధాని మోదీ తొలిసారిగా స్పందించారు. తాజాగా జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తానెప్పుడూ పత్రికా ఇంటర్వ్యూలను తిరస్కరించలేదని మోదీ పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం మీడియా పాత్ర మారిందని, ప్రజలతో మమేకమయ్యేందుకు అనేక కొత్త వేదికలు వచ్చాయన్నారు.

తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి కంటే ఇప్పుడు విలేకరుల సమావేశాలు నిర్వహిస్తున్నానని ప్రధాని బదులిచ్చారు. మీడియాను రకరకాలుగా వాడుకుంటున్నారని, ఆ దారిలో వెళ్లడం తనకు ఇష్టం లేదని స్పష్టం చేశారు. నేను కష్టపడి పనిచేయాలని అనుకుంటా. పేద ప్రజల సమస్యలు తీర్చాలని భావిస్తా. అయితే, నేను రిబ్బన్లు కత్తిరించి ప్రచార ఫొటోలతో ప్రచారం చేసుకోవచ్చు . ఏదైనా రాష్ట్రంలో చిన్న జిల్లాకు వెళ్లి అక్కడ ఓ చిన్న స్కీమ్ కోసం పనిచేయడమే నాకు ఇష్టం’ అని మోదీ అన్నారు. 

 ఒకప్పటి లాగా మీడియా ప్రస్తుతం ప్రత్యేక వ్యవస్థ కాదని పేర్కొన్నారు. ఒకప్పుడు తాను పత్రికలకు ఇంటర్వ్యూలు ఇచ్చేవాడినని, కానీ ప్రస్తుతం తనను ఇంటర్వ్యూ చేసే యాంకర్ల పేరు కూడా ప్రజలకు తెలుసని పేర్కొన్నారు. ఈ రోజుల్లో ప్రజలతో కమ్యూనికేట్ చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఇకపై మీడియాతో సంబంధం లేకుండా ప్రజలు తమ అభిప్రాయాలను వెల్లడించవచ్చని ఆయన అన్నారు.

తాజా వార్తలు

Airtel Digital TV అమెజాన్ ప్రైమ్‌తో సహకరిస్తుంది Airtel Digital TV అమెజాన్ ప్రైమ్‌తో సహకరిస్తుంది
ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ తన కొత్త అల్టిమేట్ మరియు అమెజాన్ ప్రైమ్ లైట్ ప్లాన్‌ను ప్రారంభించేందుకు అమెజాన్ ప్రైమ్‌తో భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఈ భాగస్వామ్యం ఉత్తమమైన లైవ్...
US ఫెడ్ రేటు నిర్ణయం కంటే ముందే సెన్సెక్స్, నిఫ్టీ పెరుగుదల; ఓలా ఎలక్ట్రిక్ షేర్లు దూసుకుపోయాయి
స్మృతి ఇరానీ ప్రపంచ బ్యాంకు నేతలతో లింగ సమానత్వం గురించి చర్చించారు
అమెరికన్ జిమ్నాస్ట్ జోర్డాన్ చిలెస్ స్విస్ సుప్రీంకోర్టుకు ఒలింపిక్ కాంస్యాన్ని పునరుద్ధరించడానికి బిడ్ తీసుకున్నాడు
డిఫెండింగ్ ఛాంపియన్స్ భారత్ 1-0తో చైనాను ఓడించి ఐదో ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టైటిల్‌ను గెలుచుకుంది.
టెస్టు సిరీస్‌లో భారత్‌ను ఓడించగలమని బంగ్లాదేశ్ నమ్ముతోంది: షోరిఫుల్ ఇస్లాం
తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ నెలాఖరు నుంచి కొత్త రేషన్ కార్డులను జారీ చేయనుంది