ఈరోజు లోక్‌సభలో ప్రసంగించనున్న ప్రధాని మోదీ!

 

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని ఈరోజు పార్లమెంట్‌లో ప్రధాని మోదీ మాట్లాడే  అవకాశం ఉంది. ధ‌న్య‌వాద తీర్మానంపై  చర్చించడానికి 16 గంటలు కేటాయించారు. అయితే మంగళవారం సాయంత్రానికి చర్చలు ముగిసే అవకాశం ఉంది.

అయితే మంగళవారం సాయంత్రంతో చర్చ ముగిసే అవకాశం ఉంది. ఈ విషయంపై ప్రధాని మోదీ సమాధానం చెప్పనున్నారు. నీట్ రద్దుపై శుక్రవారం చర్చించాలని విపక్షాలు పట్టుబట్టడంతో ఆ రోజు సమావేశం జరగలేదు.

అయితే సోమవారం ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తమను హిందువులుగా చెప్పుకునే భారతీయ జనతా పార్టీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు హింసకు పాల్పడ్డాయని రాహుల్ తన ప్రసంగంలో ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను పార్లమెంట్‌లో ప్రధాని మోదీ తోసిపుచ్చారు. అయితే రాహుల్ వ్యాఖ్యలను ప్రధాని మోదీ ఎలా తిప్పికొడతారనేది ఆసక్తికరంగా మారింది. ఈరోజు రాత్రి ప్రధాని మోదీ ప్రసంగం చేయనున్నట్లు తెలుస్తోంది.ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాని మోదీ స‌మాధానం ఇవ్వ‌నున్నారు.

About The Author: న్యూస్ డెస్క్