ప్ర‌ధాని మోదీతో క‌లిసి ఇట‌లీ ప్ర‌ధాని సెల్ఫీ ఫోటో వైర‌ల్

జీ7 దేశాల పర్యటన ముగించుకుని ప్రధాని మోదీ భారత్‌కు తిరిగొచ్చారు. అయితే శుక్రవారం ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ అక్కడ ప్రధాని మోదీతో కలిసి సెల్ఫీ దిగారు. మెలోని తన ఫోన్‌ను చేతిలో పట్టుకుని మోదీతో కలిసి ఫోటో దిగింది. ఈ సెల్ఫీ ఫోటో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. జీ7 సదస్సు సందర్భంగా జార్జియా మలోనీతో ద్వైపాక్షిక చర్చల్లో మోదీ పాల్గొన్నారు. ఇటలీలోని పుగ్లియాలో ఈ సమావేశాలు జరిగాయి. ఇద్దరూ సెల్ఫీ తీసుకుంటూ పెద్దగా నవ్వారు. గతేడాది దుబాయ్‌లో జరిగిన COP28 సదస్సు సందర్భంగా కూడా ఈ సెల్ఫీని తీసుకున్నారు. ఈ ఫోటో ఇప్పుడు వైరల్‌గా కూడా మారింది. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోదీ తొలిసారి విదేశీ పర్యటనకు వెళ్లారు. మెలోని ఆహ్వానం మేరకు ఇటలీ వెళ్లాడు. రక్షణ, భద్రత రంగంలో ద్వైపాక్షిక సహకారంపై ఇద్దరూ చర్చించారు.

About The Author: న్యూస్ డెస్క్