ఆర్చరీ ప్రపంచకప్‌ స్టేజ్‌-2 ఫైనల్లో జ్యోతిసురేఖ, పర్నీత్‌కౌర్‌, అదితిస్వామి

ప్రతిష్టాత్మకమైన స్టేజ్‌- 2 ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో భారత మహిళల జట్టు ఫైనల్స్‌కు చేరుకుంది. బుధవారం జరిగిన సెమీఫైనల్లో భారత త్రయం జ్యోతిసురేఖ,పర్నీత్‌కౌర్‌ , అదితిస్వామి 233-229తో అమెరికాను ఓడించారు. శనివారం జరిగే ఫైనల్లో భారత్ టర్కీతో తలపడనుంది. మరోవైపు పురుషుల టీమ్ ఈవెంట్‌లో ప్రియాంష్,పార్థమేశ్‌ , అభిషేక్‌ల త్రయం ఆస్ట్రేలియా చేతిలో కాంస్య పతకాన్ని కోల్పోయింది.

About The Author: న్యూస్ డెస్క్