హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో గురువారం గుజరాత్ టైటాన్స్తో సన్రైజర్స్ హైదరాబాద్ ఆడాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. ఇరు జట్లూ ఒక్కో పాయింట్ సాధించాయి. ఫలితంగా సన్రైజర్స్ హైదరాబాద్ 15 పాయింట్లతో ప్లేఆఫ్కు అర్హత సాధించింది. మరోవైపు లీగ్ సీజన్ను గుజరాత్ 12 పాయింట్లతో ముగించింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా ఇరు జట్ల ఆటగాళ్లు తమ లాకర్ రూమ్లలోనే ఉండాల్సి వచ్చింది. అయితే ఆట రద్దయిన తర్వాత ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.సన్రైజర్స్ హైదరాబాద్ మాజీ ఆటగాడు కేన్ విలియమ్సన్ SRH మేనేజ్మెంట్ మరియు ఆటగాళ్లతో గడిపాడు. ఈ సీజన్లో కేన్ విలియమ్సన్ గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడుతున్న సంగతి తెలిసిందే. కావ్య మారన్ మరియు కేన్ విలియమ్సన్ కౌగిలించుకొని, ఆత్మీయంగా మాట్లాడి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ వీడియోను సన్రైజర్స్ హైదరాబాద్ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది.