తెలంగాణ రాష్ట్రంలోని పెద్దాపూర్ గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలలో ఆరో తరగతి విద్యార్థి మృతి

పెద్దాపూర్ గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలలో శుక్రవారం తెల్లవారుజామున ఆరో తరగతి చదువుతున్న విద్యార్థి అనూహ్యంగా మృతి చెందడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. రాజన్న-సిరిసిల్ల జిల్లా యల్లారెడ్డిపేటకు చెందిన అనిరుధ్ అనే విద్యార్థికి తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో విపరీతమైన కడుపునొప్పి రావడంతో జగిత్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించేలోపే మృతి చెందాడు.

అనిరుధ్ హఠాన్మరణానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అదే పాఠశాలలో మరో విద్యార్థి ఇలాంటి పరిస్థితుల్లో మరణించిన పది రోజుల తర్వాత ఈ సంఘటన జరిగింది. అదే రోజు ఉదయం మరో ఇద్దరు ఆరో తరగతి విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మెట్‌పల్లి మండలం ఆత్మకూర్‌కు చెందిన మోక్షిత్‌ నిజామాబాద్‌ ప్రభుత్వాసుపత్రికి, మల్యాల మండలం తాటిపల్లి గ్రామానికి చెందిన హేమంత్‌ యాదవ్‌ మెట్‌పల్లి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ వివరాలను ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎండీ సాజిద్ ధృవీకరించారు.

About The Author: న్యూస్ డెస్క్