ట్రాన్స్కో అధికారులు తమ గ్రామంలో అనధికారికంగా కరెంటు కోతలు విధిస్తున్నారని ఆరోపిస్తూ.. శనివారం అల్లాదుర్గం మండలం గొల్లకుంట తండా వద్ద ఎన్హెచ్-161పై రైతులు రాకపోకలను అడ్డుకుని నిరసన తెలిపారు.
గ్రామంలో శుక్రవారం విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఓ రైతుకు చెందిన నాలుగు మేకలను దొంగలు ఎత్తుకెళ్లారని రైతులు ఆరోపించారు. తమ గ్రామం సబ్స్టేషన్కు అరకిలోమీటర్ దూరంలోనే ఉందని, ట్రాన్స్కో అధికారులు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని రైతులు వాపోతున్నారు. దీంతో రోడ్డుకు ఇరువైపులా అరగంట పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది.
సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చి నిరసన విరమించాలని పోలీసు అధికారులు రైతులకు నచ్చజెప్పారు.