ఖమ్మంలో దారుణం: ఆస్తి కోసం తల్లి మరియు ఇద్దరు కూతుర్ల హత్య

తల్లాడ్ మండలం గోపాలపేటలో దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పిట్టల వెంకటేశ్వర్లు ఆస్తిని చేజిక్కించుకోవాలని తల్లి, ఇద్దరు కూతుళ్లను హత్య చేశాడు. ఆస్తి తన పేరుపై నమోదు కాలేదన్న కోపంతో వెంకటేశ్వర్లు తల్లి పిచ్చమ్మ(60)ని గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం తన ఇద్దరు కుమార్తెలు నీరజ (10 ఏళ్లు), ఝాన్సీ (6 ఏళ్లు)లను హత్య చేసి పరారయ్యాడు.

కొన్నాళ్లుగా పొలం తన పేరున రిజిస్ట్రేషన్ చేయాలని వెంకటేశ్వర్లు తల్లిని వేధిస్తున్న సంగతి తెలిసిందే. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు స్థానికులు తెలిపారు. వెంకటేశ్వర్లుకు ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉందని, రెండేళ్ల క్రితం భార్యను కూడా హత్య చేసినట్లు స్థానికులు తెలిపారు.

About The Author: న్యూస్ డెస్క్