![తెలంగాణలో విద్యుత్తు అంతరాయం](https://www.netipourusham.com/media-webp/c200x160/2024-07/telangana-to-face-power-shortage-generation-hit-in-kothagudem-thermal-plants_v_jpg--816x480-4g.jpg)
రెండు గ్రామాల్లో వంద శాతం పోలింగ్!
- ప్రజాస్వామ్య విలువను చాటి చెప్పిన తెలంగాణ పల్లెలు
- జగిత్యాల జిల్లా చిన్నకొల్వాయిలో వంద శాతం పోలింగ్
- అలాగే మెదక్ జిల్లా సంగాయిపేట తండాలోనూ ఓటర్ల చైతన్యం
తెలంగాణలోని ఈ రెండు గ్రామాలు ప్రజాస్వామ్య విలువను చాటిచెప్పాయి. ఓటర్లు ఓటువేసి తమ చైతన్యాన్ని వ్యక్తం చేశారు. లోక్సభ నాలుగో దశ ఎన్నికల పోలింగ్ సోమవారం రాష్ట్రంలో జరిగింది. ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం చిన్నకొల్వాయిలో 100 శాతం పోలింగ్ నమోదైంది. గ్రామంలో 110 మంది ఓటర్లు ఉండగా, వీరంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవడం గమనార్హం. వందశాతం ఓటింగ్కు కృషి చేసిన సెక్టార్ అధికారి శక్రునాయక్, కార్యదర్శి ముద్దం విజయ్, బీఎల్ఓ యశోద, రూట్ అధికారి రాజ్కుమార్లను కలెక్టర్ యాస్మిన్ బాషా ప్రత్యేకంగా అభినందించారు.
అదేవిధంగా మెదక్ జిల్లా కొల్చారం మండలం సంగాయిపేట తండాలో 100 శాతం ఓటింగ్ నమోదైంది. ఈ తండాలో ఏర్పాటు చేసిన అదనపు పోలింగ్ కేంద్రం 62ఏలో 210 మంది ఓటర్లు ఉన్నారు, అందరూ ఓటు వేశారు. పోలింగ్ కేంద్రంలో 95 మంది పురుష ఓటర్లు, 115 మంది మహిళా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు తేలింది. సంగాయిపేట తండా ప్రజలకు మెదక్ కలెక్టర్ అభినందనలు తెలిపారు.
ఇదిలావుంటే, సాయంత్రం 5 గంటల వరకు తెలంగాణలో 61 శాతం ఎన్నికలు నమోదైనట్లు ఈసీ నివేదించింది. ముఖ్యంగా గ్రామీణ తెలంగాణలో పోలింగ్ శాతం దాదాపు 70 శాతం దాటింది.