సిరిసిల్లలో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి

ద్విచక్ర వాహనాన్ని డీసీఎం వాహనం ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. షేక్ అబ్దుల్, సయ్యద్ చంద్ అక్కడికక్కడే మృతి చెందారు.

గభీరావుపేట మండలం పెద్దమ్మ స్టేజీ వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు.

ద్విచక్ర వాహనాన్ని డీసీఎం వాహనం ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. షేక్ అబ్దుల్, సయ్యద్ చంద్ అక్కడికక్కడే మృతి చెందారు.
కామారెడ్డి జిల్లా పెద్దమల్లారెడ్డి మండలం మల్లుపల్లె వాసులు, మృతులు వేములవాడ వైపు వెళ్తున్నారు. పెద్దమ్మ స్టేజీ వద్దకు రాగానే డీసీఎం వాహనం వీరి బైక్‌ను ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు.

విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

About The Author: న్యూస్ డెస్క్