పెంపుడు కుక్క కరిచిందని యజమాని పై దాడి, వీడియో వైరల్
- పెంపుడు కుక్క కరవడంతో మధురానగర్ లో రెండు కుటుంబాల మధ్య గొడవ
- ఎలెక్షన్ల వల్ల పోలీసులు వెంటనే స్పందించకపోవడం తో వారం తర్వాత కర్రలతో దాడి
పెంపుడు కుక్క రెండు కుటుంబాల మధ్య చిచ్చు పెట్టింది. కర్రలు, రాళ్లతో దాడి చేసుకునేదాకా తెచ్చింది. . తాము ప్రేమగా పెంచుకున్న కుక్క అదే వీధిలో నివసిస్తున్న మరో కుటుంబానికి చెందిన వ్యక్తిని కరవడంతో గొడవ మొదలైంది. బాధిత కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. మరుసటిరోజు రోడ్డు మీద కుక్కతో కనిపించిన యువకుడిని పట్టుకుని చితకబాదారు. అడ్డుకున్న మహిళలపై కూడా కర్రలతో దాడి చేశారు. కొద్దిసేపటికి చుట్టుపక్కల వ్యక్తులు కూడా కనిపించడంతో వారు శాంతించారు. దాడిలో యువకుడి కుటుంబీకులు గాయపడడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారిని ఆస్పత్రికి తరలించారు. దాడి మొత్తం అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధురానగర్లో మధు, ధనుంజయ్ కుటుంబాల మధ్య గొడవ జరిగింది. గత బుధవారం మధు కుక్క ధనుంజయ కుటుంబసభ్యుడిని కరిచింది. దీంతో ధనుంజయ్ మధు కుటుంబీకులతో వాగ్వాదానికి దిగి సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఒక వారం తర్వాత, మంగళవారం సాయంత్రం, మధు సోదరుడు శ్రీనాథ్ తన కుక్కను వాకింగ్ తీసుకెళ్లాడు. కుక్కతో రోడ్డుపై వెళ్తున్న శ్రీనాథ్ ను చూసి ధనుంజయ కుటుంబ సభ్యులు రెచ్చిపోయారు. కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. కుక్కపై కూడా దాడి చేశారు. గొడవను చూసిన శ్రీనాథ్ చెల్లి, తల్లి అడ్డుకునేందుకు పరుగెత్తారు. అయినా ధనుంజయ్ కుటుంబానికి చెందిన యువకులు కర్రలతో కొట్టడం ఆపలేదు. దీంతో ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి. ఇంతలో చుట్టుపక్కల ప్రజలు అక్కడికి చేరుకోవడంతో యువకులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని శ్రీనాథ్, అతని సోదరి, తల్లిని ఆస్పత్రికి, కుక్కను వెటర్నరీ క్లినిక్కి తరలించారు. శ్రీనాథ్ ఫిర్యాదు మేరకు ధనుంజయ కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు.
#Hyderabad
— Glint Insights Media (@GlintInsights) May 16, 2024
Three injured in Rahmatnagar as two families clash over a pet dog. Canine also harmed. Police arrest five. Dispute erupts during postal ballot voting as husky accompanies Madhu's family. Altercation reported by Madhura Nagar police; case filed by both parties. pic.twitter.com/RNVdW08juc