![హ్యాట్సాప్ అంటున్న నెటిజన్లు](https://www.netipourusham.com/media-webp/c200x160/2024-05/s1148.png)
హైదరాబాద్ లో మరోసారి పట్టుబడ్డ డ్రగ్స్
On
- ఎస్వోటీ పోలీసుల దాడుల్లో పట్టుబడ్డ గంజాయి, ఎండీఎంఏ
- కూకట్పల్లి పరిధిలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఏకకాలంలో అధికారుల సోదాలు
- పోలీసుల అదుపులో నలుగురు నిందితులు
హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ స్వాధీనం మరోసారి కలకలం రేపింది. కూకట్పల్లి శేషాద్రినగర్లో స్థానిక పోలీసులతో కలిసి SOT అధికారులు దాడులు నిర్వహించారు. సోదాల సమయంలో అధికారులు 3 గ్రాముల MDMA ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం డ్రగ్స్ విక్రయిస్తున్న రాజశేఖర్, శైలేష్రెడ్డిలను అరెస్టు చేశారు.
జగద్గిరిగుట్ట పోలీసులతో పాటు ఎస్వోటీ పోలీసులు తలసీనగర్లోనూ సోదాలు నిర్వహించారు. ఇద్దరు నిందితులు రోహిత్, తిలక్ సింగ్ నుంచి 45 గ్రాముల గంజాయి, 3 గ్రాముల MDMA స్వాధీనం చేసుకున్నారు. ఈ రెండు కేసులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Tags: Telangana
తాజా వార్తలు
08 Jul 2024 18:18:14
యూఎస్ఏ, వెస్టిండీస్లో జరిగిన టీ20 ప్రపంచకప్లో టీమ్ఇండియాకు విజయాన్ని అందించిన తర్వాత ఇటీవలే టీ20ల నుంచి రిటైరయిన రోహిత్ శర్మ వచ్చే ఏడాది జరగబోయే రెండు ముఖ్యమైన...