తీహార్ జైలులో కవిత, కేటీఆర్ ములాఖత్

ఢిల్లీలోని తీహార్ జైలులో కవితను కేటీఆర్ కలిశారు. కవితను మర్యాదపూర్వకంగా పలకరించి ఆమె ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవిత రిమాండ్‌ను రోజ్ అవెన్యూ కోర్టు మరో రెండు వారాల పాటు పొడిగించిన సంగతి తెలిసిందే. సీబీఐ నమోదు చేసిన కేసులో ఆమెకు ఈ నెల 21 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అయితే తనకు చదువుకునేందుకు తొమ్మిది పుస్తకాలు ఇవ్వాలని కోర్టును కోరగా.. కోర్టు అందుకు అనుమతించింది. తదుపరి విచారణ ఈ నెల 21న జరగనుంది. ఆమెతో భేటీ అనంతరం కేటీఆర్ హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు.

About The Author: న్యూస్ డెస్క్