70 వేలకు పైగా మెజార్టీతో గెలుపొందిన ప‌వ‌న్ క‌ల్యాణ్

పీఠాపురం జిల్లాలో పవన్ సునామీలో వైసీపీ కొట్టుకుపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన సమీప ప్రత్యర్థి వైసిపి అభ్యర్థి వంగ గీతపై 70,354 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు,  సంబరాలు చేసుకుంటున్నారు.పవన్ కళ్యాణ్ గెలిచాడని తెలిసి ఆయన కుటుంబం భావోద్వేగానికి గురయ్యారు. టీవీ తెరపై పవన్ విజయాన్ని చూసిన అతని సోదరి కాస్త భావోద్వేగానికి లోనైంది. కాగా, పిఠాపురంలో ఎన్నికల ఫలితాలను తన కుటుంబ సభ్యులు, సైనికులతో కలిసి నాగబాబు పర్యవేక్షిస్తున్నారు. ఇక పవన్ విజయంతో సైనికులు పండగ వాతావరణం నెలకొంది.ఏపీలో ఎన్నికల కౌంటింగ్ జరుగుతోంది. ఎన్నికల ఫలితాల ప్రకారం, మొదటి రౌండ్ ఓటింగ్ నుండి టిడిపి-బిజెపి-జనసేన కూటమి అత్యధిక స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా కుటమి (టీడీపీ) 133 స్థానాల్లో, జనసేన 21 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.

About The Author: న్యూస్ డెస్క్