టీటీడీ కొత్త ఈవో గా శ్యామలరావు!
On
ఏపీలో కొత్త ప్రభుత్వం రాగానే, అనేక కీలక పదవుల్లో ఉన్న వ్యక్తులు తప్పుకోవడమో, లేక కొత్త ప్రభుత్వమే వారిని సాగనపంపడమో జరుగుతోంది. ప్రముఖ తిరుమల ఆలయ వ్యవహారాలను పర్యవేక్షించే టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) ద్వారా శుద్ధి చేయనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు.
టీటీడీ ఈఓ ధర్మారెడ్డిని ఇప్పటికే తొలగించారు. ఆయన స్థానంలో టీటీడీ కొత్త ఈఓగా జె.శ్యామలరావు నియమితులయ్యారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, విధుల నుంచి తొలగించిన ధర్మారెడ్డి సెలవుపై వెళ్లారు.
శ్యామరావు ప్రస్తుతం ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. ఆయన గతంలో జలవనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా కూడా పనిచేశారు.
Tags:
Related Posts
తాజా వార్తలు
తిరుపతి లడ్డూపై పచ్చి అబద్ధాలు చెబుతున్న సీఎం చంద్రబాబు నాయుడును మందలించిన ఎస్సీ: జగన్మోహన్ రెడ్డి
05 Oct 2024 18:28:05
తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని, సెప్టెంబర్ 30, అక్టోబరు 4న తమ ఆదేశాలను పరిశీలిస్తే అది స్పష్టమైందని మాజీ...