![నేడు పులివెందులకు జగన్!](https://www.netipourusham.com/media-webp/c200x160/2024-06/nister-ys-jagan-mohan-reddy-020518991-16x9.webp)
ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా
On
ఏపీ అసెంబ్లీ సమావేశం రేపటికి వాయిదా పడింది. మొత్తం 175 మంది ఎమ్మెల్యేల్లో 172 మంది ఎమ్మెల్యేలతో స్పీకర్ ప్రొటెమా గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు.
అందుబాటులో లేకపోవడం తదితర కారణాలతో ఎమ్మెల్యే జి.వి. ఆంజనేయులు (వినుకొండ), పితాని సత్యనారాయణ (ఆచంట), వనమాడి వెంకటేశ్వరరావు (కాకినాడ) ప్రమాణ స్వీకారం చేయలేకపోయారు. ఈ ముగ్గురు పార్లమెంటు సభ్యులు రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
రేపు (జూన్ 22) 10.30 గంటలకు సమావేశం కొనసాగనుంది. ముగ్గురు ప్రజాప్రతినిధులు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత స్పీకర్ ఎన్నిక ప్రక్రియ జరగనుంది. రేపు ఉదయం 11 గంటలకు ఏపీ అసెంబ్లీ స్పీకర్గా అయ్యన్నపాత్రుడు ఎన్నిక కానున్నారు. ఇప్పటికే అయ్యన్న తరఫున కూటమి నేతలు అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించారు.
Tags:
తాజా వార్తలు
05 Jul 2024 13:49:52
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రేషన్ పంపిణీపై పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్డియు (మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్) వాహన నిర్వాహకులు గత పరిపాలనలో...