‘ఇండియన్‌-2’ డేట్ ఫిక్స్!

కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'భారతీయుడు-2' కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా జూలై 12న ఇండియా అంతటా థియేటర్లలోకి రానుంది.త్వరలో అధికారిక ప్రకటన రానుందని సమాచారం. ఈ చిత్రం శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో 1996లో వచ్చిన  చిత్రానికి సీక్వెల్. ఎన్నో అడ్డంకులను అధిగమించి ఈ సినిమా చిత్రీకరణ మూడేళ్లు పట్టింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని, నాణ్యత తగ్గకుండా దర్శకుడు శంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారని మేకర్స్ తెలిపారు. ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా ఈ సినిమాలో బలమైన సామాజిక సందేశం ఉంటుందని చిత్ర నిర్మాణ బృందం తెలిపింది. సిద్ధార్థ్‌, కాజల్‌ అగర్వాల్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, ప్రియా భవానీ శంకర్‌, ఎస్‌జె సూర్య, బాబీ సింహా తదితరులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం సమకూర్చారు.

About The Author: న్యూస్ డెస్క్