![నిరవధిక నిరాహార దీక్ష కారణంగా ఆరోగ్యం క్షీణించిన అతిషి LNJP ఆసుపత్రిలో చేరారు](https://www.netipourusham.com/media-webp/c200x160/2024-06/atishi-2024-06-c3a09e90ce28ea0a1d3698b88fc38832-1200x675.jpg)
కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయమంత్రిగా భూపతిరాజు శ్రీనివాసవర్మ
నరసాపురం లోక్సభ స్థానం నుంచి మహాకూటమి అభ్యర్థిగా ఎన్నికల్లో గెలుపొందినకేంద్ర సహాయ మంత్రిగా నియమితులైన సంగతి తెలిసిందే. ఎన్డీఏ ప్రభుత్వంలో భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రిగా నియమితులయ్యారు.ఈ నేపథ్యంలో ఈరోజు ఢిల్లీలో కేంద్ర సహాయ మంత్రిగా శ్రీ భూపతిరాజు శ్రీనివాసవర్మ పదవీబాధ్యతలు స్వీకరించారు చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ, కిషన్రెడ్డి, ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహారావు కుటుంబసభ్యులు హాజరయ్యారు.ఈ సందర్భంగా భూపతిరాజు శ్రీనివాసవర్మ మాట్లాడుతూ.. ప్రజల మనోభావాలను గౌరవిస్తామని, విశాఖ స్టీల్ప్లాంట్ను ప్రైవేటీకరించకుండా చూస్తామన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు బాబుతో సమన్వయం చేసుకుని రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పాటు అందిస్తామన్నారు. గత పాలనలో రాష్ట్రం విడిచి వెళ్లిన కంపెనీలతో మాట్లాడి తిరిగి రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.