కేరళలో తొలిసారి బీజేపీ విజయం

కేరళలో తొలిసారిగా బీజేపీ పార్లమెంట్‌ సీటును గెలుచుకుంది. త్రిస్సూర్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన మలయాళ నటుడు ప్రధాన అభ్యర్థిగా కొనసాగుతున్నారు. ఆయన గెలుపు దాదాపు ఖాయమైంది. ప్రస్తుతం  4,09,239 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు.దీని తర్వాత సీపీఐ అభ్యర్థి సునీల్ కుమార్ 3,34,160 ఓట్లతో రెండో స్థానంలో, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మురళీధరన్ 3,24,431 ఓట్ల మెజారిటీతో మూడో స్థానంలో ఉన్నారు. సునీల్ కుమార్ కంటే సురేష్ గోపి 75,079 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. కౌంటింగ్‌ దాదాపు ముగింపు దశకు చేరుకోవడంతో గెలుపు ఖాయమైపోయింది.దాంతో సురేష్ గోపి అప్పుడే సెలబ్రేషన్స్ లో మునిగిపోయాడు. స్థానిక బీజేపీ శ్రేణులు, మద్దతుదారులతో కలిసి సంబరాలు చేసుకున్నారు.

About The Author: న్యూస్ డెస్క్