- పూణె విమానాశ్రయంలో ఘటన
- విమానంలో 180 మంది ప్రయాణికులు
- విచారణకు ఆదేశించిన డీజీసీఏ
నిన్న ఢిల్లీకి వెళ్లాల్సిన ఎయిరిండియా విమానానికి పూణె విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. టేకాఫ్కు ముందు రన్వేపైకి తీసుకొచ్చిన టగ్ ట్రక్నే ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 180 మంది ప్రయాణికులు ఉన్నారు.
ఈ ప్రమాదంలో విమానం ముక్కుకు, ల్యాండింగ్ గేర్ దగ్గర ఉన్న టైరు బాగా దెబ్బతిన్నట్టు అధికారులు తెలిపారు. అయితే విమానానికి ఎలాంటి ప్రమాదం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఘటన అనంతరం వారందరినీ దింపి విమానాన్ని మరమ్మతుల కోసం తరలించారు. అనంతరం వారిని ప్రత్యామ్నాయ విమానంలో ఢిల్లీకి పంపించారు. విమానం, టగ్ట్రక్ ఢీకొనడానికి గల కారణాలపై దర్యాప్తునకు డీజీసీఏ ఆదేశించింది. ఈ ఘటనతో విమానాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగలేదని అధికారులు తెలిపారు.