పద్దతులు మారకపోతే రేవంత్ రెడ్డి సీఎంగా ఉండరుని మంద కృష్ణ మాదిగ హెచ్చరించారు

పద్ధతి మార్చుకోకపోతే కనుక కాంగ్రెస్ పార్టీ ఉండదని... రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండరని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. గురువారం ఆయన ప్రసంగిస్తూ.. సార్వత్రిక ఎన్నికల్లో మాదిగలకు ఒక్క సీటు కూడా ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని విమర్శించారు. మాదిగలపై మోసం చేసిన రేవంత్ రెడ్డికి శిక్ష పడుతుందని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ పద్దతి మార్చుకోవాలని హితవు పలికారు. లేకుంటే తమ పార్టీ ఉనికి లేదని...రేవంత్ రెడ్డి సీఎం కాదని హెచ్చరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు ఎందుకు గెలవలేదో ఆలోచించుకోవాలని ఆయన కోరారు.

About The Author: న్యూస్ డెస్క్