కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత..!

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత..!

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నీట్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కాచిగూడలోని ఆయన ఇంటిని విద్యార్థి సంఘాల నేతలు ముట్టడించారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాలైన ఎన్‌ఎస్‌యుఐ, ఎస్‌ఎఫ్‌ఐ, ఎఐఎస్‌ఎఫ్‌, పిడిఎస్‌యు, డివైఎఫ్‌ఐ, ఎఐవైఎఫ్‌, పివైఎల్‌ నాయకులు ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు.

ఈ క్రమంలో పోలీసులకు, విద్యార్థులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి అదుపు తప్పడంతో ఎమ్మెల్సీ వెంకట్‌, విద్యార్థి సంఘాల నేతలను అరెస్టు చేశారు. వారిని నలకుంట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నీట్ అంశంపై కేంద్ర మంత్రితో సమావేశం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించగా, మంత్రి స్పందించకపోవడంతో హాస్టల్‌ను సీజ్ చేసినట్లు విద్యార్థి సంఘాల నాయకులు తెలిపారు.

Tags:

తాజా వార్తలు

ఏపీలో రేషన్ పంపిణీపై కీలక నిర్ణయం ఏపీలో రేషన్ పంపిణీపై కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రేషన్ పంపిణీపై పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్‌డియు (మొబైల్ డిస్‌పెన్సింగ్ యూనిట్) వాహన నిర్వాహకులు గత పరిపాలనలో...
ఆ ఒక్క రోజు దర్శన సమయం మార్పు
రూ.60వేల కోట్లతో భారీ ప్రాజెక్ట్
సీతారామన్‌తో చంద్రబాబు భేటీ
పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు: ఓఆర్‌ఆర్‌ అబ్దుల్లాపూర్‌మెట్‌
నిరుద్యోగ యువత నిరసనతో టీజీపీఎస్సీ కార్యాలయాన్ని పటిష్టం
హైదరాబాద్ సెయిలింగ్ వీక్‌లో రితికకు డబుల్ డిలైట్