ఇరాన్‌లో భారీ భూకంపం రిక్టరు స్కేలుపై 4.9గా నమోదు

ఇరాన్‌లో భారీ భూకంపం రిక్టరు స్కేలుపై 4.9గా నమోదు

| ఇరాన్‌లో భారీ భూకంపం సంభవించింది. మంగళవారం మధ్యాహ్నం 1:24 గంటలకు ఈశాన్య కష్మార్ నగరంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.9గా నమోదైనట్లు స్థానిక మీడియా వెల్లడించింది. భూకంపం కారణంగా  నలుగురు మరణించినట్లు సమాచారం. దాదాపు 120 మంది గాయపడ్డారని ప్రభుత్వ మీడియా పేర్కొంది.యుఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం, భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో ఉంది. భూకంపం ధాటికి భారీ భవనం ధ్వంసమైంది. అనేక భవనాలు దెబ్బతిన్నాయని కష్మార్‌  గవర్నర్ హోజతుల్లా షరియత్మదారి నివేదించారు. రోడ్లు కూడా ధ్వంసమయ్యాయని అంటున్నారు. ప్రభావిత ప్రాంతాల వాసులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లినట్లు తెలిసింది.ఇరాన్ వివిధ టెక్టోనిక్ ప్లేట్లపై ఉంది కాబట్టి, ఇక్కడ తరచుగా భూకంపాలు సంభవిస్తాయి. గత సంవత్సరం ప్రారంభంలో, టర్కీ సరిహద్దుకు సమీపంలో వాయువ్య ఇరాన్ పర్వతాలలో 5.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. 800 మందికి పైగా గాయపడ్డారు. 2003లో ఇరాన్‌లో కూడా అత్యంత బలమైన భూకంపం సంభవించింది. ఆగ్నేయ ఇరాన్‌లోని బామ్‌లో 6.6 తీవ్రతతో సంభవించిన భూకంపం 31,000 మందికి పైగా మరణించింది.

Tags:

తాజా వార్తలు

తిరుమల లడ్డూ  కేసులో సిట్ దర్యాప్తు నిలిపివేత తిరుమల లడ్డూ కేసులో సిట్ దర్యాప్తు నిలిపివేత
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించే నూనెలో కల్తీ జంతువుల కొవ్వు కలిసిందన్న నేపథ్యంలో ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. గత మూడు...
ప్రాఫిట్-బుకింగ్ మధ్య ఓలా ఎలక్ట్రిక్ షేర్లు రూ.100 దిగువకు పడిపోయాయి
నిఫ్టీలో టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, శ్రీరామ్ ఫైనాన్స్ లాభపడ్డాయి
నోమ్ షాజీర్‌ని తీసుకురావడానికి గూగుల్ $2.7 బిలియన్లను చెల్లిస్తుంది
టీ20 ప్రపంచకప్: భారత్‌కు మూడో నంబర్ చిక్కుముడి కొనసాగుతోంది
భారతదేశం vs బంగ్లాదేశ్: శిథిలాల మధ్య మోమినుల్ ఎత్తుగా ఉంది
27,000 అంతర్జాతీయ పరుగులు పూర్తి చేసిన నాలుగో ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు