సిరిసిల్లలో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి
ద్విచక్ర వాహనాన్ని డీసీఎం వాహనం ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. షేక్ అబ్దుల్, సయ్యద్ చంద్ అక్కడికక్కడే మృతి చెందారు.
On
గభీరావుపేట మండలం పెద్దమ్మ స్టేజీ వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు.
ద్విచక్ర వాహనాన్ని డీసీఎం వాహనం ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. షేక్ అబ్దుల్, సయ్యద్ చంద్ అక్కడికక్కడే మృతి చెందారు.
కామారెడ్డి జిల్లా పెద్దమల్లారెడ్డి మండలం మల్లుపల్లె వాసులు, మృతులు వేములవాడ వైపు వెళ్తున్నారు. పెద్దమ్మ స్టేజీ వద్దకు రాగానే డీసీఎం వాహనం వీరి బైక్ను ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు.
విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
Tags:
Related Posts
తాజా వార్తలు
తిరుమల లడ్డూ కేసులో సిట్ దర్యాప్తు నిలిపివేత
01 Oct 2024 15:59:46
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించే నూనెలో కల్తీ జంతువుల కొవ్వు కలిసిందన్న నేపథ్యంలో ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. గత మూడు...